శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి "ఆరుపడై వీడు" ఆరు శక్తి క్షేత్రాలలో జరుగు ఉత్సవమైన
"తైపూసమ్" కావడి సేవ నగరోత్సవము.
ఫిబ్రవరి 5 వ తేదీ 2023 , ఆదివారం ఉదయం 6.00 గంటలకు,
మచిలీపట్నం జిల్లా పరిషత్ సెంటర్ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం నుండి , 270 కావడులు, 180 పాలకలశములతో "షట్కోణ యంత్ర" పూజ జరిపించుకొని, "పంబ ఉడుక్కై" మరియు "సన్నాయి మంగళ" వాయిద్యాలతో "ఫలణి కావడి పాదయాత్ర" వలె నగరోత్సవము పాతబస్టాండ్ "పర్వతవర్ధిని శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి " వారి దేవస్థానమునకు చేరును, తదుపరి కావడి ధారులచే శ్రీ వల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవమూర్తి కి అభిషేకం జరుగును.
ఫిబ్రవరి 6 వ తేదీ 2023 సోమవారం ఉదయం 7.00 గంటలకు "సుబ్రహ్మణ్య పాశుపతాస్త్ర హోమం" జరుగును.
కావున భక్తులు పాల్గొని సుబ్రహ్మణ్య స్వామి వారి కృపకు పాత్రులు కావలసినదిగా ప్రార్ధన.
కావడి సేవకై సంప్రదించండి :
కార్తికేయ సేవ ట్రస్ట్ (రి. 77 22), గొడుగుపేట, మచిలీపట్నం - 9247330323