Monday, 24 March 2025

వేల్, మయూరము తోడు - Tiru Murugaatrupadai



*శరవణభవ*

🙏వెట్రి వేల్ మురుగన్ కి హరోంహర 🙏

 *వేల్, మయూరము🦚 తోడు*

ఈ కీర్తన సుమారు 5000 పైగా సంవత్సరముల పూర్వము *నక్కీరదేవర్ అను శివదాసుడైన సిద్ధులు రచించిన సుబ్రహ్మణ్యస్వామి యొక్క ఆరు క్షేత్రములు, సుందరమైన సుబ్రహ్మణ్యం రూపము, శూరపద్మాసుర సంహారము, వల్లి దేవసేన కళ్యాణము, కొంగునాడు కు (తమిళనాడు కేరళ మధ్య ప్రాంతం) అధిపతి గా, ఆరు ముఖములు ద్వాదశ హస్తములతో శత్రుసంహారకుడిగా, దేవతల సర్వ సైన్యాధికారిగా, సుబ్రహ్మణ్యస్వామి వారి గురించి 317 భాగములతోను ప్రతిభాగములో 300కు పైగా పద్యములతో నిండి ఉన్న తమిళ భాషలో లిఖితమైన *తిరుమురుగ ఆర్ట్రుపడై* అను గ్రంథములోనిది. 

*అనువాదం/వివరణ* : 
స్కందా!! అని పేరు తలచిన అంతటనే! మనకు వచ్చియున్న దుఃఖము, కష్టము మరియు రాబోవు విపత్తులు అన్నీయు తనకు తానే కలవరపడి మనల్ని వదిలి పారిపోవును. అగ్ని కూడా వారిని తాకుటకు భయపడును. సెన్నినగర్ ( చెన్నిమలై, తిరుప్పూర్ వద్ద ) సేవకా నేనుండగా భయమేలా అని తిరునీరు (నొసట విభూతి) ధరించిన స్వామి ఆరాధకులకు సేవ చేయడానికి మురుగన్ వేలాయుధం తానుగా పరుగున వచ్చును.  

*చెన్నీమలై ఆండవన్ కు అరోగర* 

అనువాదం: 
రవికుమార్ P 
కార్తికేయ సేవ ట్రస్ట్ 
మచిలీపట్నం.

TiruKadaiyoor Kaala Samhaara Moorthi - తిరుకడైయూర్ కాళసంహార మూర్తి #kaalasamharamoorthi #tirukadaiyoor



ధరుమై ఆధీనం పీఠం పాలిత అష్ట వీర స్థలములలో ఒకటైన, శ్రీ అభిరామి సమేత అమృత కంఠేశ్వర స్వామి దేవాలయం లో పరమేశ్వరుడు భక్త మార్కండేయ నాయన్మార్ ను అనుగ్రహించిన కాళసంహార మూర్తి గా దర్శనం ఇచ్చు పుణ్యక్షేత్రం , తిరుకడైయూర్ 🙏🔯🕉️

#kaalasamharamoorthi #tirukadaiyoor 

https://www.thirucadaiyurtemple.org/#/

https://www.facebook.com/share/16L32jNfwV/

Sunday, 23 March 2025

63 నాయనార్ల నామావళి ని తిరుతొండర్ తొగై - దేవారం గానం #Thevaram - #tiruthondar




ఓం నమః శివాయ - శివాయ నమః 

తిరుతొండర్ తొగై - దేవారం గానం ణాళ్వర్ (నలుగురు) శివ భక్త నాయనారు లలో ఒకరైన సుందరర్ నాయనారు , 63 నాయనార్ల నామావళి ని తిరుతొండర్ తొగై (శివ దాసుల కూటమి) అను శీర్షికనామంతో రచించిన ఈ కీర్తన, తరువాతి కాలంలో తంజావూర్ బ్రిహదీశ్వర ఆలయం నిర్మాణ కర్త శ్రీ రాజ రాజ చోళుని ఆజ్ఞ మేరకు ఆస్థాన కవి అయిన నంబిఆండార్ నంబి దేశ సంచారం చేసి 63 నాయనార్ల జీవిత చరిత్రలను మరియు ఆ నాయనార్ల రచనలు కలిగిన తాళపత్ర గ్రంధములను సంగ్రహించి పెరియపురాణం అను నామం తో గ్రంథ రచన చేసి తిల్లై (తిరుచిత్అంబలం) నటరాజ స్వామి పొన్నాంబళం (స్వర్ణ వేదిక ) సన్నిధి లో రాజ రాజ చోళుని సమక్షంలో అరంగేట్రం చేసి పెరియపురాణం గ్రంధం ను జాతికి అంకితం చేసెను , తేదుపరి కాలంలో ప్రాచీన శివ భక్తి గ్రంధములు క్రోడీకరణ లో ఈ పెరియపురాణం పన్నెండు తిరుమురైగల్ (12 శివభక్త పురాణములు) లో ఒకటిగా స్థానం పొందినది. 

 https://www.youtube.com/watch?v=j3zT6yhDffM  

రవికుమార్ P. 
కార్తికేయ సేవ ట్రస్ట్,
మచిలీపట్టణం 
 9059065452